అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో ఒక్కటైనా ఆప్త (APTA ) ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతూ అనతికాలంలోనే ఎంతో మంచి ప్రవాసుల సంస్థగా మన్ననలు అందుకుంది .అయితే ఈ అమెరికాల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ (APTA) 2008లో ప్రారంభమైంది.
ఈ సంస్థ గత పదేళ్ళ కాలంలో చేసిన కార్యక్రమాలు ఎన్నారైలకి ఎంతగానో ఉపయోగపడ్డాయి.ముఖ్యంగా
యూఎస్ లో ఉంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు ,ఉద్యోగులు ఎదుర్కునే ఇబ్బందులని పరిష్కరించడం కోసం తమవంతు సాయాన్ని అందిస్తోంది ఆప్త.అంతేకాదు ప్రతీ ఏడాది, సంస్థ ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ.తెలుగువారందరిలో ఐకమత్య భావన కోసం కృషిచేస్తోంది.
ప్రస్తుత సభ్యుల సంఖ్య 5వేలుగా ఉంది.
ఆప్త నూతన కార్యవర్గంలో కోర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నటరాజు యిల్లూరి, బనారసిబాబు, ఎనుముల ఇన్నయ్య, శివ మొలబంటి, డా.నీరజా నాయుడు చవకులు, శ్రీకాంత మెన్నం, లక్ష్మి చింతల, రావూరి సుభాషిణి, కోడె సురేష్, డా.గోపాల్ సిరిసాని, తోట వీరా, మదన్ మోహన్ బోనేపల్లి ఎంపికయ్యారు.అలాగే ఈ ఆప్త కి నూతన అధ్యక్షుడిగా ఎంపిక అయిన నటరాజు యిల్లూరి మాట్లాడుతూ.ఆవిర్భావం నుంచి సంస్థ ఎదుగుదలకు కృషిచేసిన గత కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.