అమెరికాలోని బ్రోంక్స్ జూలో ఉన్న ఒక పులికి జూ అధికారి ద్వారా కరోనా వైరస్ సోనిక విషయం తెల్సిందే.జంతువులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇండియాలో కూడా జూల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు.
జాతీయ అటవి శాఖ ఇంకా పర్యవరణ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని జూలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అందులో జూలో ఉండే ప్రతి జంతువు యొక్క కదలికను నిషితంగా గమనించాలంటూ ఆదేశించారు.
జూలో పని చేసే ప్రతి ఉద్యోగిని కరోనా లక్షణాలు ఉన్నాయా లేవా అనేది పరీక్షించాలి.ఏమాత్రం అనుమానం ఉన్న కూడా జూలో విధులు నిర్వహించేందుకు అంగీకరించవద్దు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల కదలికలను పరీక్షించాలంటూ ఆదేశించారు.జంతువుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు వచ్చినా కూడా వెంటనే వాటికి తక్షణమే చికిత్స అందించడంతో పాటు వాటిని ప్రత్యేకంగా ఉంచాలనేది ఆదేశాల్లో పేర్కొన్నారు.