చైనా తో యుద్దానికి మళ్లీ సై అంటున్న అమెరికా

అగ్రరాజ్యం అమెరికా,డ్రాగన్ దేశం చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా ఇటీవల ఈ వాణిజ్య యుద్దానికి తెరపడింది అని భావించారు.

 America Raised Taxes On China-TeluguStop.com

అయితే ఈ చర్చలు మందగించడం తో అగ్రరాజ్యం అమెరికా మరోసారి చైనా పై వాణిజ్య యుద్దానికి తెర తీసింది.ఈ నేపథ్యంలో దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల పై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

దీనితో మరోసారి డ్రాగన్ దేశం తో వాణిజ్య యుద్దానికి తెర తీసినట్లు తెలుస్తుంది.ఈ సుంకాలు మే 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

గత 10 నెలల నుంచి డ్రాగన్ దేశం 50 బిలియన్ డాలర్ల వస్తువుల పై 10 శాతం సుంకాన్ని అమెరికా చెల్లిస్తూ వస్తుంది.

అయితే ఇప్పుడు తాజాగా ఆ 10 శాతం సుంకం విధింపు ఇప్పుడు 25 శాతం కి పెంచుతూ మరోసారి వాణిజ్య యుద్దానికి తెర లేపింది.చైనా, అమెరికాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధానికి పరిష్కార మార్గం కనుగొనేందుకు గత ఏడాది నవంబర్ లో జీ-20 సమావేశం లో దేశాధినేతలు ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే.100 రోజులు ఇరు దేశాల సుంకాలు పెంచకూడదంటూ ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాయి.అయితే ఈ మార్చి నెలతో ముగియడం తో ఆ గడువును మరి కొంత కాలం పొడిగించగా ఇప్పుడు తాజాగా అధ్యక్షుడు ట్రంప్ పై మేరకు నిర్ణయం తీసుకున్నారు.అయితే దీనిపై దేశం చైనా స్పందించలేదు.

సమగ్ర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చైనా ఉన్నతాధికారులతో బుధవారం వాషింగ్టన్ లో సమావేశం నిర్వహించనున్నారు.అయితే ఈ సమావేశంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube