సర్కారువారి పాట కోసం షికాగో వెళ్ళబోతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో గత ఏడాది సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కొంత కాలం గ్యాప్ ఇచ్చి పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమాని ఎనౌన్స్ చేశారు.

 America Location Finalized For Mahesh Film Shoot, Tollywood, Telugu Cinema, Para-TeluguStop.com

ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన తర్వాత లాక్ డౌన్ నుంచి సడలింపులు వచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ జరుగుతుందని అందరూ భావించారు.ఫస్ట్ షెడ్యూల్ ని పరశురామ్ అమెరికాలో స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అయితే అక్కడ కరోనా పరిస్థితులలో వెంటనే షూటింగ్ కి అనుమతులు లభించలేదు.ఈ నేపధ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు.దానికి రంగం సిద్ధం అయ్యింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ విలన్ గా కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసిన పరశురామ్ కి అనుమతులు దొరికాయని తెలుస్తుంది.

హైదరాబాదు షెడ్యూల్ ముగిసిన వెంటనే అమెరికా షూటింగుకి యూనిట్ బయలుదేరుతుందని తెలుస్తుంది.బ్యాంక్ స్కాముల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతున్న నేపధ్యంలో అలంటి వాతావరణంలో ఎలివేట్ అయ్యే ప్రాంతంలో షూటింగ్ చేయాలని పరశురామ్ ప్లాన్ చేసుకున్నాడు.

ఈ నేపధ్యంలో అమెరికాలో తమ కథకు అవసరమైన ఒరిజినల్ బ్యాంకును ఎంచుకున్నట్టు తెలుస్తోంది.షికాగోలో షూటింగుకి అవసరమైన బ్యాంకును ఇప్పటికే మాట్లాడినట్లు, స్థానిక అధికారుల అనుమతులు కూడా లభించినట్టు సమాచారం.

ఇక హైదరాబాద్ షెడ్యూల్ జనవరి ఫెస్టివల్ తరువాత స్టార్ట్ చేయడానికి పరశురామ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube