అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పుంజుకోవడంతో సుమారు 6500 మంది మృత్యువాత పడగా దాదాపు 2.5 లక్షల మంది కరోనా సోకి మృత్యువుతో పోరాడుతున్నారు.అమెరికా వైద్యులు రోగుల వైద్య సేవలో నిలిచిపోగా అమెరికా వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు మూత పడిపోయాయి.దాంతో కేవలం ఒక్క వారం రోజుల వ్యవధిలోనే నిరుద్యోగ సైన్యం రెట్టింపయ్యింది….
మార్చి మొదటి వారం నుంచి ఇప్పటివరకు సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టుగా కార్మిక శాఖ ప్రకటించింది.మార్చి మొదటి వారంలో 2,11,000 మంది నిరుద్యోగుల ఉండగా అదే సంఖ్య నెల చివరివారం కి వచ్చేసరికి 2,81,000 చేరుతుంది.
ఈ పరిస్థితికి కారణం కరోనా ప్రభావం ఎక్కువగా లేని ప్రాంతాలు కూడా లాక్ డౌన్ పాటించడమేనని కార్మిక శాఖ తెలిపింది…
అమెరికాలోని ముఖ్య నగరాలు ,రాష్ట్రాలు లాక్ డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లోని కంపెనీలు పలు సంస్థలు ఆదాయం లేక మూసివేయడంతో ఎంతో మంది అమెరికన్లు, వలస వాసులు ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దాంతో ప్రస్తుతం అమెరికా పరిస్థితి 2008 నాటి మాంద్యం కంటే కూడా ఎక్కువగా ఉందని కార్మిక శాఖ వెల్లడించింది.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులని ఎదుర్కోవాల్సి ఉంటుదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.