అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన వ్యక్తి మృతిచెందారు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.
న్యూజెర్సీలోని సౌత్ బ్రున్స్విక్కు చెందిన భారతీయ అమెరికన్ గత వారం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.ఆయన ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
కారులో ముందు సీటులో కూర్చొన్న రాంసుధ మాడబుషి (57) అక్కడికక్కడే మృతి చెందగా… నిస్సాన్ నడుపుతున్న అతని 21 ఏళ్ల కుమారుడు , 16 ఏళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే స్పందించిన సహాయక బృందాలు వారిద్దరిని రాబర్ట్ వుడ్ జాన్సన్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.GoFundMe పేజీ ప్రకారం, రాంసుధ కుమారుడి మెదడుకి గాయం కావడంతో అతను ICUలో ఇంకా అపస్మారక స్థితిలోనే వున్నాడు.
ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి, వారు కోలుకున్న తర్వాత అవసరాల కోసం మాడబుషి బావ ప్రభు కళ్యాణ సుందరం , అతని సోదరి శ్రీలక్ష్మీ కళ్యాణ సుందరంలు ఆన్లైన్లో నిధుల సేకరణ చేపట్టారు.తన సోదరి కుటుంబం కోల్పోయిన దానిని తాము భర్తీ చేయలేమని, కానీ ఆమెకు ఆర్ధిక భారాన్ని తగ్గిస్తామని ప్రభు అన్నారు.
ఇప్పటి వరకు గో ఫండ్ మీ పేజీకి 1,38,856 అమెరికా డాలర్ల విరాళాలు వచ్చాయి.
కాగా.ఆగస్ట్ 2న మధ్యాహ్నం 12.26 గంటలకు సౌత్ బ్రూన్స్విక్లోని వెస్ట్ బౌండ్ లేన్లో మాడబుషి కుటుంబం ప్రయాణిస్తున్న కారును డంప్ ట్రక్కు ఢీకొట్టింది.సమాచారం అందుకున్న మోన్ మౌత్ జంక్షన్ అగ్నిమాపక విభాగం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిస్సాన్ కారు నుంచి మాడబుషి కుటుంబ సభ్యులను బయటకు తీశారు.సౌత్ బ్రూన్స్విక్, మన్రో ఈఎంఎస్ , పారామెడిక్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.
—
.