తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడిని క్షమించేసాడు.ఓ అమెరికా అధ్యక్షుడు ఓ కోడికి క్షమాభిక్ష పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.? కాకపోతే ఈ విషయం వెనుక పెద్ద చరిత్ర దాగి ఉంది.అమెరికాలో ఎన్నికల జరిగినాక అధికారం నుంచి దిగిపోయే అమెరికా అధ్యక్షులకు టర్కీ దేశం నుంచి కోళ్లను బహుమతిగా పంపించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఆ దిగిపోతున్న అధ్యక్షుడికి కోసం మేలురకమైన టర్కీ కోళ్లను ఆ దేశ అధ్యక్షులు అమెరికాకు పంపిస్తారు.అయితే ఈ కోళ్లను తినడం, లేకపోతే క్షమించి వదిలేయడం లాంటి పనులు చేస్తారు.
ఈ ప్రక్రియ వైట్ హౌస్ లో ఆనవాయితీగా వస్తుంది.
ఈ మధ్యకాలంలో జరిగిన అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారంలోకి వచ్చాక వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి డోనాల్డ్ ట్రంప్ కి సమయం ఆసన్నమైంది.
దీంతో డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా పాటించాల్సిన సాంప్రదాయాలను ఒక్కోకోటిగా అమలు చేస్తున్నారు.వైట్ హౌస్ లో సంప్రదాయబద్ధంగా నిర్వహించే “థాంక్స్ గివింగ్ డే” లో భాగంగా డోనాల్డ్ ట్రంప్ ఆయన భార్యతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగా మరో వేడుకగా జరిగింది.రోజ్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డోనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్ లో జోకులు వేస్తూ అందరిని ఉత్సాహపరిచాడు.
ఈ కార్యక్రమంలో భాగంగానే కార్న్ అనే ఓ టర్కీ కోడిని క్షమించి ప్రాణభిక్ష పెట్టాడు.ఈ కోడితో పాటు కోబ్ అనే మరో టర్కీ కోడిని కూడా క్షమించి ఆయన వదిలేశారు.
ఆ కార్యక్రమం అనంతరం అధికారులతో కలిసి రుచికరమైన వంటకాలతో విందు కొనసాగించారు.
ప్రతిసారి థాంక్స్ గివింగ్ డే కార్యక్రమానికి ముందు ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వ్యక్తిగా ది నేషనల్ టర్కీ ఫెడరేషన్ సంస్థ రెండు భారీ టర్కీ కోళ్లను బహుకరిస్తుంది.అయితే జార్జి డబ్ల్యూ బుష్ కంటే ముందు ఉన్న అధ్యక్షులు వీటిని తినడానికి ఇష్టపడినా, జార్జి డబ్ల్యూ బుష్ నుండి వీటిని క్షమాభిక్ష పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.ఇలా క్షమాభిక్ష మొట్టమొదటిసారిగా 1989 లో అధికారికంగా జార్జి హెచ్ డబ్ల్యు బుష్ అధ్యక్షతన మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా ఆ టర్కీ కోళ్ల జీవించేందుకు వదిలేశారు.అప్పుడు నుంచి చాలామంది అధ్యక్షులు టర్కీ కోళ్లను జీవించడానికే వదిలేస్తున్నారు.