అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూఇద్దరి మధ్య గత కొంత కాలంగా పడటంలేదని అందరికి తెలిసిన విషయమే.కరోనా కారణంగా వారి మాటల యుద్ధం మరీ తీవ్రతరమయ్యింది.
ఈ మధ్య కాలంలో శ్వేతసౌధం లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ఆండ్రూ దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చారు.రెండు రోజుల క్రితం ట్రంప్ మాట్లాడుతూ దేశంలో ఆంక్షలు ఎత్తేసే అధికారం ఫెడరల్ ప్రభుత్వానికి, దేశాధ్యక్షుడికి మాత్రమే ఉందని తెలిపారు.
అంతేకాదు.
దేశంకి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తన అనుమతి లేకుండా ఏమీ చేయడానికి లేదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలే న్యూయార్క్ గవర్నర్ కి కోపం తెప్పించాయి.దాంతో ఘాటుగా స్పందించిన ఆండ్రూ అసలు అమెరికాకి రాజు అనే వాడు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి హక్కలు ఉండవని చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేలా లేవని అన్నారు.
ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్ నగరం కరోనా మృతులతో శవాల దిబ్బగా మారిపోయింది.అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో తలమునకలై ఉంది.ఈ క్రమంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆండ్రూని బాధించడంతో ట్రంప్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారంటూ స్థానిక పత్రికలు రాసుకోచ్చాయి.
ఇదిలాఉంటే ఇప్పటి వరకూ అమెరికాలో మృతి చెందిన వారితో పోల్చితే న్యూయార్క్ నగరమే ఫస్ట్ ప్లేస్ లో ఉంది.న్యూయార్క్ లో ఇప్పటి వరకూ కరోన బారిన పడిన వారి సంఖ్య 1.10 లక్షలు కాగా.మృతుల సంఖ్య 7700 లకి చేరుకుంది.