మహమ్మారి కరోనా వైరస్ చైనా నుండి ప్రపంచ దేశాలకు ఎంట్రీ ఇచ్చాక.దాదాపు అన్ని దేశాలు మాస్క్ తప్పనిసరి చేయటం జరిగింది.2020 సంవత్సరం నుండి.ప్రపంచ దేశాలు ఈ వైరస్ నీ ఎదుర్కోవడం కోసం… ఏ దేశానికి ఆ దేశం… తమ పౌరులను మాస్కు ధరించాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటూ నిబంధనలు విధిస్తూ ఉన్నాయి.
ఇప్పటికీ ఈ నిబంధనలు చాలా దేశాలలో కొనసాగుతూనే ఉన్నాయి.వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా గానీ ఈ మహమ్మారిని అరికట్టటం ఎవరివల్ల కావటం లేదు.మరోపక్క కొత్త కొత్త రూపాయలతో సరికొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.
ఇలాంటి దశలో ప్రపంచంలో మొట్టమొదటి సారిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు వైరస్ భయం లేదు.
అంటూ అధికారికంగా ప్రకటించిన దేశం ఇజ్రాయెల్.ఎప్పుడైతే ప్రపంచ దేశాలలో కి ఈ వైరస్ వచ్చిందో మొదటి నుండి చైనా ని.ఎండగడుతూ ఉన్న దేశం ఇజ్రాయెల్.ఒక దురుద్దేశంతో చైనా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం జరిగింది.
కోటి జనాభా కలిగిన ఈ దేశం… ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కొంది.వైరస్ వచ్చిన వెంటనే ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలు.
ఆ దేశాన్ని ఇప్పుడు విజయ పథంలో నడిపిస్తూ ఉన్నాయి.ఇప్పుడు ఇదే జాబితాలో కి అమెరికా చేరింది.
మాస్క్ ఫ్రీ రెండో దేశంగా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది.తాజాగా అక్కడి అధికారులు దేశంలో పౌరులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో భూమి మీద ఎక్కువ మూల్యం చెల్లించకుండా దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఆర్థికపరంగా గాని ప్రమాణాల పరంగా గాని కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు అమెరికాలో సంభవించాయి.కానీ ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశ పౌరులకు ధరించాల్సిన అవసరం లేదు అన్న తరహాలో.దేశంలో పరిస్థితులు మారినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది.
ఈ పరిణామంతో భూమి మీద మాస్క్ ఫ్రీ ఇజ్రాయిల్ మొదట ప్రకటించగా తాజాగా అమెరికా అన్నట్టు వార్తలు వస్తున్నాయి.