ఆ రాత్రి ప్రాణాలు అరచేతి లో పెట్టుకొని బ్రతికాను.ఎప్పుడు ఎవరు వచ్చి రేప్ చేస్తారో అని భయపడ్డ.
చంపుతారోనని వణికిపోయానంటూ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ మాట్లాడిన ఓ ఆడియోటేప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై, తెలుగులో పవన్ కల్యాణ్ తో బద్రి సినిమాల తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బద్రి తరువాత నాని, నరసింహుడు సినిమాల్లో నటించింది.ఆ తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.
ప్రస్తుతానికి అమీషా పటేల్ ప్రొడక్షన్ లో తానే ప్రొడ్యూసర్ గా రొమాంటిక్, కామెడీ జోనర్ లో దేశీ మ్యాజిక్ అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.దీంతో ఖాళీగా ఉండలేక తన సినీ గ్లామర్ తో బీహార్ లో జరిగిన తొలి విడుత ఎన్నికల ప్రచారం లో పాల్గొంది.
బీహార్ లోని లోక్ జన శక్తి పార్టీ అభ్యర్ధి ప్రకాశ్ చంద్ర తరుపున దౌడ్ నగర్ లో ప్రచారం నిర్వహించింది.ఆ ప్రచారం నాకు కాళ రాత్రిని మిగిల్చింది.
ప్రచారంలో తాను ప్రచారం చేస్తున్న అభ్యర్ధి ప్రకాశ్ చంద్ర తనని బెదిరించాడని, ఓ సమయంలో తనపై హత్యాచారం జరగుతుందో, హత్య చేస్తారోనని భయపడింది.
తన టీమ్ సహకారంతో బీహార్ నుంచి సురక్షితంగా ముంబైకి వచ్చినట్లు అమిషా పటేల్ మాట్లాడిన ఓ ఆడియో టేప్ తీవ్రదుమారం రేపుతోంది.
ఈ వివాదం పై ప్రకాశ్ చంద్ర స్పందించారు.అమిషా పటేల్ కావాలనే తమపై అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
జన్ అధికార పార్టీ అధినేత పప్పు యాదవ్ దగ్గర డబ్బులు తీసుకొని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు.
.