టాలీవుడ్ లో నాని సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్.ఈ భామ ఇప్పుడు వెటరన్ యాక్టర్ గా మారిపోయింది.
బాలీవుడ్ లో అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.అయితే ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాల కోసం తన బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చిపోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా అమీషా పటేల్ తనని మోసం చేసింది అని అజయ్ అనే వ్యక్తి కేసు పెట్టాడు.ఇప్పుడు ఇది బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
దేశీ మ్యాజిక్ అనే సినిమా కోసం అజయ్ వద్ద అమీషా 2.5 కోట్లు అప్పు తీసుకున్నారని, కానీ ఆ మొత్తాన్ని ఆమె తిరిగి ఇవ్వలేదని అజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.తాజాగా మీడియాతో ముందుకి వచ్చిన అజయ్ ఓ కార్యక్రమం కోసం అమీషా, కునాల్ గత ఏడాది మార్చిలో రాంచీ వచ్చినప్పుడు నా దగ్గర 2.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు.వారి సినిమా జూన్ 2018లో విడుదల అవుతుందని, లాభాలు వస్తాయని నాతో చెప్పుకోచ్చారని, అయితే ఇప్పటి వరకు సినిమా రిలీజ్ కాలేదని.
గతంలో ఓ సారి అడిగితే రెండు, మూడు నెలల్లో వడ్డీతో కలిపి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని ప్రామిస్ చేశారని చెప్పారు.తర్వాత 3 కోట్ల చెక్ ఇచ్చారాని కానీ అది బౌన్స్ అయ్యింది అని అజయ్ చెప్పారు.దీంతో మళ్లీ వారిని కలిస్తే డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పారు.అంతేకాదు అమీషా ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు చూపించి నన్ను బెదిరించే ప్రయత్నం చేసారని అజయ్ చెప్పారు.
మరి ఈ ఫిర్యాదుపై అమీషా పటేల్ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.