తంగళ్ళపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత , ప్రపంచ మేధావి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , రాజకీయవేత్తగా ,న్యాయవేత్తగఆర్థికవేత్తగా , సామాజికవేత్తగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ.జయంతి సందర్భంగా ఈరోజు సిఐటియు తంగళ్ళపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలలు వేసి ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

 Ambedkar Jayanti Celebrations Under The Auspices Of Citu At Tangallapally , Cit-TeluguStop.com

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ జిల్లాలోని కార్మిక వర్గ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి మూలస్తంబాలైనా,సమానత్వం సామాజికన్యాయం ప్రజాస్వామ్యం , లౌకికత్వాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేసే విధానాలను అవలంబిస్తుందని భారత రాజ్యాంగం స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుందని అన్నారు.

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజానీకం అందరి సందర్భంగా ఆయన విగ్రహాలకు , ఫోటోలకు దండలు వేసి దండాలు పెట్టడం ఆయనకు ఇచ్చే నివాళి కాదని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి పైన ముఖ్యంగా యువత పైన ఉందని ఆ విధంగా అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోర అజయ్ , గడ్డం రాజశేఖర్ , కంది మల్లేశం , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు , బింగి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube