మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి అమరావతి రాజధాని పరిరణక్ష సమితికి విరాళంగా తన బంగారు గాజులు ఇచ్చిన విషయం తెల్సిందే.భువనేశ్వరి విరాళంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందంటూ ఆమె ముందుకు వచ్చి ఈ విరాళం ఇచ్చింది.వైకాపా ప్రభుత్వం రాజధానిని మార్చే ఉద్దేశ్యంతో ఉన్న కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
భువనేశ్వరి రైతుల గురించి చెందుతున్న ఆందోళనపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవ చేశాడు.గతంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదు.తెలుగు దేశం పార్టీ హయాంలో పుష్కరాల సమయంలో ఎంతో మంది మరణిస్తే భువనేశ్వరి గారు పట్టించుకోలేదు.కాని ఇప్పుడు రాజధాని రైతుల కోసం అంటూ ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు.
ఇంతకు భువనేశ్వరి గారికి రాజధాని రైతులపై అభిమానమా లేదంటే అమరావతి భూములపై అభిమానమా అనేది చెప్పాలంటూ డిమాండ్ చేశాడు.