వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు తాడేపల్లి గూడెంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
చంద్రబాబు, జగన్ చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక కుల, మతాలను అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడు.జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి చాలా మంది పార్టీ మారి వైసీపీ పార్టీలోకి వచ్చి చేరుతున్నారు.
అది చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నాడని అన్నాడు.బూట్లు వేసుకొని ఆలయాలకు, యజ్ఞాలకు వెళ్ళే సంస్కృతి నీది అని ఎద్దేవా చేశాడు.
చంద్రబాబు కు రాముడి మీద అంతా భక్తి ఉంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఆలయంను నిర్మించలేదు ఎందుకని ప్రశ్నించాడు.
నిజంగా చంద్రబాబు హిందువు అయితే అమరావతిలో అమరలింగేశ్వర స్వామి బొమ్మ పెట్టలే గాని ఎందుకు అని బుద్దుడు బొమ్మ పెట్టినట్లుగా ప్రశ్నించాడు.
జగన్ మత మార్పిడిలకు ప్రోత్సహిస్తున్నాడని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను అంబటి తీవ్రంగా ఖండించాడు.నిరంతరం ప్రజల పాలనలో ఉన్న జగన్ పై ఇలాంటి అబండాలు వేయడం చంద్రబాబు రాజకీయ జీవితనికి సిగ్గు చేటని అన్నాడు.
పాస్టర్ లకు 5 వేల రూపాయలు జగన్ ఇస్తున్నాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అంబటి తిప్పికొట్టాడు.అన్నీ మతాలో ఉన్న పేదలకు కూడా ఇస్తున్నాం అన్నాడు.ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పైన విమర్శలు చేశాడు.