తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి.
దీంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నటాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత “దిల్ రాజు” కి ఈ చిత్రాన్ని కొనుక్కునేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ దాదాపుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించడానికి ముందుకు వచ్చిందట.
కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ చిత్రాన్ని ఓటీటీ కి అమ్మడానికి సముఖంగా లేనట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.
కాగా ఈ విషయంపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు తెరవడానికి మరింత సమయం పట్టేలా ఉందని కాబట్టి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫారం కు సరసమైన ధరకు అమ్మేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ విషయం పై నిర్మాత దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న “విరూపాక్ష” అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.
కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు వాయిదా వేసినట్లు సమాచారం.