సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ రోజు థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సర్కారు వారి పాట’.
ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడగా వారి ఎదురు చూపులు ఈ రోజుతో తీరిపోయాయి.ఈ సినిమా అలా రిలీజ్ అయ్యిందో లేదో థియేట్రికల్ రిలీజ్ కోసం ముందే భారీ పోటీ నెలకొంది.
అసలు రిలీజ్ కు ముందే కోట్ల రూపాయలు పెట్టి మరీ ఓటిటి రైట్స్ దక్కించు కుంటున్నాయి.థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఆఫర్స్ ప్రకటించి మరీ ఒత్తిడిలు పోటీ పడుతున్నాయి.
థియేటర్ లో వచ్చిన రిజల్ట్ తో సంబంధం లేకుండా ఓటిటి లో రిలీజ్ చేసుకుని సినిమాని మార్కెట్ చేసుకుంటున్నారు.
ఇక థియేటర్ లో సక్సెస్ అయితే ఈ సినిమాలకు మరింత ఎక్కువ క్రేజ్ వస్తుంది.తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట కూడా అప్పుడే భారీ ధరకు ఓటిటి కి అమ్ముడు అయినట్టు తెలుస్తుంది.ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా రైట్స్ ను భారీ ధరకు దక్కించుకుందని సమాచారం.
ఈ సినిమా ఎన్ని కోట్లకు దక్కించుకుంది అన్న విషయం తెలియాల్సి ఉంది.సర్కారు వారి పాట ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా విషయం తెలిసిందే.సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కొన్ని వారాల గ్యాప్ తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారట.మినిమమ్ 6 వారాల తర్వాతనే ఈ సినిమా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.