మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ జోష్ లోకి వచ్చాడు.ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.ఇక డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ నెల ఆఖరులో ఖిలాడీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూత పడటంతో వాయిదా పడిపోయింది.
మళ్ళీ ఈ సిచువేషన్ నార్మల్ అయ్యి థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు రిలీజ్ కాకుండా ఉంచాలంటే బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ఈ నేపధ్యంలో ఇప్పటికే చాలా సినిమాలో ఒటీటీ రిలీజ్ కి క్యూ కట్టేస్తున్నాయి.
ఒటీటీ చానల్స్ కి డిమాండ్ భాగా ఉండటంతో వారు కూడా మంచి ఆఫర్స్ ఇస్తూ సినిమాని సొంతం చేసుకోవాలని పోటీ పడుతున్నారు.
ఈ నేపధ్యంలో క్రాక్ సినిమా హిట్ టాక్ రావడంతో ఒటీటీ నుంచి ఖిలాడీ మూవీకి అదిరిపోయే ఆఫర్ వచ్చింది.
క్రాక్ సినిమా థియేటర్ లో మంచి వసూళ్లు రాబట్టింది.అలాగే ఆహ ఒటీటీకి కూడా మంచి రెవెన్యూ అందించింది.దీంతో అమెజాన్ ప్రైమ్ చానల్ ఖిలాడీ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 45 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.రవితేజ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే 45 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది.
అలాంటిది ముందుగానే అమెజాన్ నుంచి అంత పెద్ద మొత్తంలో ఆఫర్ రావడంతో నిర్మాత డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ డీల్ ఒకే అయితే త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే రవితేజ రీసెంట్ గా ఓ కొత్త దర్శకుడుతో సినిమా స్టార్ట్ చేశాడు.అలాగే వక్కంతం వంశీ, త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఖిలాడీ రిలీజ్ తర్వాత త్రినాధ్ రావు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.