ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.అనేక దేశాల ఆర్థిక ఖజానాలు దివలాలు తీశాయి.
భారతదేశం రూపాయి కూడా రోజురోజుకీ పతనం చెందుతూ ఉంది.కరోనా సృష్టించిన విధ్వంసానికి.
చాలా దేశాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి.దీంతో చాలా కంపెనీలు లాస్ లోకి వెళ్లిపోయి దుకాణం సర్దేస్తున్నాయి.
ఐటీ వంటి రంగాలలో చాలా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది.ఇలాంటి తరుణంలో అమెజాన్ సంస్థ సంచలన ప్రకటన చేయడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే ఇండియాలో ఫుడ్ డెలివరీ వ్యాపారం మూసేస్తున్నట్లు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలియజేయడం జరిగింది.ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.అయితే దీన్ని తక్షణమే అమలు చేయబోమని దశలవారీగా… కస్టమర్లు మరియు పార్టనర్లకు ఇబ్బంది లేకుండా మూసేస్తామని పేర్కొంది.ఈ క్రమంలో డిసెంబర్ 29 నుండి ఫుడ్ డెలివరీ సేవలు పూర్తిగా నిలిపివేస్తామని.
అమెజాన్ స్పష్టం చేయడం జరిగింది. ఒక్క అమెజాన్ మాత్రమే కాదు జొమాటో, ట్విట్టర్.
ఇంకా పేరుగాంచిన చాలా కంపెనీల నుండి యాజమాన్యం ఉద్యోగస్తులను తీసేస్తున్నారు.