దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆనంద్ దేవరకొండ.విజయ్ దేవరకొండ అనే ట్యాగ్ తో హీరోగా తెరంగేట్రం చేసిన మొదటి సినిమాతోనే నటుడుగా ఈ కుర్ర హీరో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.
దొరసాని సినిమాలో పెద్దింటి అమ్మాయిని ప్రేమించే తక్కువ కులానికి చెందిన యువకుడుగా ఆనంద్ తన నటనతో మెప్పించాడు.ఈ సినిమా తర్వాత తన రెండో సినిమా కోసం ఆనంద్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.
వినోద్ ఆనంతోజు దర్శకత్వంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చేశాడు.లోబడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.
ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో, హీరోయిన్స్ గా నటించారు.రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు డిజిటల్ ఓటీటీ ఛానల్ అమెజాన్ ప్రైమ్ నుంచి ఊహించని బోనాంజా వచ్చింది.
రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకొని ఈ నెల 20న రిలీజ్ ప్రీమియర్ షోతో ప్రసారం చేయబోతుంది.
ఈసినిమాని అమెజాన్ ప్రైమ్ ఏకంగా 4.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని తెలుస్తుంది.ఇప్పటికే తెలుగులో వి, నిశ్శబ్దం సినిమాల మీద భారీగా డబ్బులు పెట్టి నష్టపోయిన అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు ఏ మాత్రం హైప్ లేని మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాపై ఇంత పెట్టుబడి పెట్టడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే అమెజాన్ ప్రైమ్ కి చెందిన ప్రతినిధులు సినిమా చూసిన తర్వాత బాగుంది అనే ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాతనే 4.5 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది.ఆనంద్ సినిమాకి పెద్ద మొత్తంలో పెట్టిన అమెజాన్ కి అతని ఇమేజ్ ఎంత వరకు కలెక్షన్ తీసుకొస్తుంది అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.