అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.ప్రపంచదేశాలకు కంటికి కనిపించని శత్రువుగా మారిన సంగతి తెలిసిందే.
అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్.అంతం అయ్యే రోజు కోసం ప్రపంచదేశాలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాయి.
అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ లేని ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతున్నారు.
దీంతో ప్రజలు కూడా రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఎండు ద్రాక్షతో కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఎండు ద్రాక్షను డైట్లో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు.
అనేక ఇన్ఫెక్షన్స్ ను దరిచేరకుండా చేస్తుంది.ఇక ఈ కరోనా సమయంలో గొంతు నొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
అలాంటి వారు వేడి నీటితో ఎండు ద్రాక్షను నాన బెట్టి తీసుకుంటే.గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే ఎండు ద్రాక్షతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా తినగలిగే ఆహారంలో ఎండు ద్రాక్ష ఒకటి.
ప్రతి రోజు ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు నయం అవుతాయి.అలాగే చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు.
అలాంటి వారు ఐరన్ పుష్కలంగా ఉంటే ఎండు ద్రాక్ష తింటే. రక్త హీనత సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు.
ఇక నీరసంగా ఉన్న వారు, తల నొప్పి ఉన్న వారు ఎండు ద్రాక్షలను నీటిలో నాన బెట్టి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల తల నొప్పి తగ్గడమే కాదు.
తక్షన శక్తి కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే క్రమం తప్పకుండా ప్రతి రోజు కొన్ని ఎండు ద్రాక్షలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
రక్తపోటు అదుపులో ఉంటుంది.