సీతాఫలం.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మధురమైన రుచిని కలిగి ఉండే ఈ పండును పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు.పైగా ఎన్నో పోషకాలు ఉండటం వల్ల సీతాఫలం ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.
ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.సీతాఫలమే కాదు సీతాఫలం ఆకులు కూడా ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను అందించగలవు.
మరి ఆలస్యం చేయకుండా ఆరోగ్యానికి సీతాఫలం ఆకులు ఎలా ఉపయోగపడతాయో ఓ చూపు చూసేయండి.
బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థను బలంగా మార్చడంలో సీతాఫలం ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.
అందుకు ఒక గ్లాస్ వాటర్లో రెండు లేదా మూడు శుభ్రం చేసిన సీతాఫలం ఆకులు వేసి బాగా మరిగించి.గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఇలా చేస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా మారుతుంది.ఫలితంగా వివిధ రకాల వైరస్లు, ఇన్ఫెక్షన్లు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మధుమేహం వ్యాధి గ్రస్తులకు సీతాఫలం ఆకులు ఓ వరంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేయగల సామర్థ్యం ఈ ఆకులకు ఉన్నాయి.అందుకే మధుమేహం ఉన్న వారు సీతా ఫలం ఆకులను మరిగించిన నీటిని తీసుకుంటే చాలా మంచిదని అంటున్నారు నిపుణులు.
అలాగే సీతాఫలం ఆకులతో తయారు చేసిన నీటిని ప్రతి రోజూ తీసుకుంటే.
అందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతి వంతంగా మారుస్తాయి.అదే సమయంలో వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తాయి.
ఇక ఏమైనా పుండ్లు, కాలిన గాయాలపై సీతా ఫలం ఆకులను మెత్తగా నూరి అప్లై చేయాలి.తద్వారా పుండ్లు గాయాలు త్వరగా తగ్గు ముఖం పడతాయి.