సీఎం గారి సతీమణి ఖాతాలో లక్షల రూపాయలు మాయామా అయ్యాయట.ఇంతకీ ఎవరా సీఎం గారు అని అనుకుంటున్నారా.
ఆయనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్.ఆయన సతీమణి ప్రీనిత్ కౌర్ బ్యాంకు ఖాతాలో నుంచి రూ.23 లక్షల రూపాయలు మిస్ అయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న ఆమెకు కొద్దీ రోజుల క్రితం బ్యాంకు మేనేజర్ ని అని అంటూ ఒక వ్యక్తి కాల్ చేసి,మీ ఖాతాలో జీతం డబ్బులు జమ చేయాలనీ ఖాతా వివరాలు ఇవ్వాల్సిందిగా సదరు వ్యక్తి కోరాడు.దీనితో ఆమె పూర్తి వివరాలు వెల్లడించడం తో బ్యాంక్ ఖాతా నుంచి రూ.23 లక్షలు మాయం చేసినట్లు తెలుస్తుంది.దీనితో అన్నీ వివరాలు ఇచ్చిన తరువాత తన ఖాతా నుంచి 23 లక్షలు ఎగిరినట్లు మెసేజ్ రావడం తో వెంటనే తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఇదంతా కూడా సైబర్ నేరగాళ్ల పనే అని అధికారులు భావించి ఆ ఫోన్ నెంబర్ ఆధారం గా కేసు విచారణ చేపట్టి కేసును ఛేదించారు.
జార్ఖండ్ నుంచి ఆ సైబర్ నేరగాడు ఫోన్ చేసినట్లు గుర్తించిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.మొత్తానికి ఎంపీ గారిని సైతం వదలడం లేదు ఈ సైబర్ నేరగాళ్లు.ఎంపీ గారి పరిస్థితే ఇలా ఉంటె ఇక సాధారణ మానవుడి పరిస్థితి ఏంటి అనేది మీరే అర్ధం చేసుకోవాలి.