హీరోలకు రాజధాని నిరసనకారుల సెగ

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన తెలుగు సినీ ప్రముఖులకు రాజధాని అమరావతి రైతుల నిరసన ఎదురైంది.సినీ ప్రముఖులు బస చేసిన గెస్ట్‌ హౌస్‌ వద్దకు చేరుకున్న రాజధాని ప్రాంత రైతులు మరియు తెలుగు దేశ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రాజధానిగా అమరావతి కొనసాగేలా చేస్తున్న ఉద్యమంకు మద్దతు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు.

 Ys Jagan, Amaravati, Jac Protest, Heroes Meeting Jagan, Shootings-TeluguStop.com

ఏపీ ప్రజలు మీ సినిమాలు చూసేందుకు కావాలి కాని వారికి సమస్యలు వస్తే మాత్రం మీరు స్పందించరా అంటూ నిరసన తెలియజేశారు.

చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్‌బాబులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ భేటీలో హాజరు అయ్యారు.

ఈ సందర్బంగా వారు ఈ నిరసన ఎదుర్కొన్నారు.రాజధాని ప్రాంత రైతులు చాలా కాలంగా చేస్తున్న ఉద్యమంకు మద్దతు తెలపాల్సిందిగా సినీ ప్రముఖులను అమరావతి జేఏసీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

కనీసం రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడకుండా సినీ ప్రముఖులు అక్కడ నుండి వెళ్లి పోయారు.

Telugu Amaravati, Heroes Jagan, Jac, Ys Jagan-

ఆ సమయంలో రాజధాని ప్రాంత రైతులు మరియు జేఏసీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ అక్కడ నుండి వెనుదిరిగారు.సినీ ప్రముఖులకు వ్యతిరేక నినాదాలు చేశారు.గతంలో అమరావతి రాజధాని అనగానే చాలా మంది మద్దతుగా నిలిచారు.

కాని ఇప్పుడు ఎందుకు మద్దతు తెలపడం లేదు.జగన్‌ అంటే భయపడుతున్నారా అంటూ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube