ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన తెలుగు సినీ ప్రముఖులకు రాజధాని అమరావతి రైతుల నిరసన ఎదురైంది.సినీ ప్రముఖులు బస చేసిన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న రాజధాని ప్రాంత రైతులు మరియు తెలుగు దేశ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రాజధానిగా అమరావతి కొనసాగేలా చేస్తున్న ఉద్యమంకు మద్దతు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఏపీ ప్రజలు మీ సినిమాలు చూసేందుకు కావాలి కాని వారికి సమస్యలు వస్తే మాత్రం మీరు స్పందించరా అంటూ నిరసన తెలియజేశారు.
చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్బాబులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ భేటీలో హాజరు అయ్యారు.
ఈ సందర్బంగా వారు ఈ నిరసన ఎదుర్కొన్నారు.రాజధాని ప్రాంత రైతులు చాలా కాలంగా చేస్తున్న ఉద్యమంకు మద్దతు తెలపాల్సిందిగా సినీ ప్రముఖులను అమరావతి జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
కనీసం రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడకుండా సినీ ప్రముఖులు అక్కడ నుండి వెళ్లి పోయారు.
ఆ సమయంలో రాజధాని ప్రాంత రైతులు మరియు జేఏసీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ అక్కడ నుండి వెనుదిరిగారు.సినీ ప్రముఖులకు వ్యతిరేక నినాదాలు చేశారు.గతంలో అమరావతి రాజధాని అనగానే చాలా మంది మద్దతుగా నిలిచారు.
కాని ఇప్పుడు ఎందుకు మద్దతు తెలపడం లేదు.జగన్ అంటే భయపడుతున్నారా అంటూ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.