పవన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు

అమరావతి ప్రాంతంలో రాజకీయంగా దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు.నిన్న జనసేన పార్టీ కార్యాలయంలో నిర్ణయించిన సమావేశంలో ఈ మేరకు ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటించాలని పవన్ భావించారు.

 Amaravathi Jagan Ysrcp Pavan Kalyan-TeluguStop.com

ఆ పర్యటన ద్వారా రాజధాని రైతులతో కలిసి మాట్లాడి వారికి సంగీభావం తెలపాలని పవన్ భావించి ఈ మేరకు షెడ్యూల్ కూడా ప్రకటించారు.అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

జగన్ ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఎందుకు మాట్లాడలేదని కూడా పవన్ ప్రశ్నించారు.ఇప్పుడు మూడు రాజధానులంటూ జగన్ గందరగోళం సృష్టించారని ఆరోపణలు చేశారు పవన్.

పవన్ అమరావతి పర్యటన షెడ్యూల్ లో భాగంగా ఆయన మందడం ప్రాంతానికి పవన్ వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడికి అనుమతి లేదని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు.తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు పోలీసులు సూచించారు.

ప్రస్తుతం సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున మందడానికి పవన్‌ వెళ్లేందుకు నిరాకరించారు పోలీసులు.దీని కారణంగా జనసేన కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube