ఢిల్లీ చేరిన అమరావతి రైతులు

ఏపీ రాజధాని అమరావతి కోసం వేల ఎకరాలు ఇచ్చిన తమకు జగన్‌ ప్రభుత్వం అన్యాయం చేయబోతుందని, వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతుందని అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.గత రెండు నెలలుగా అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

 Amaravathi Farmars Reached In Delhi About Ap Three Capitals-TeluguStop.com

తాజాగా వారు ఢిల్లీ వెళ్లి మరీ ఆందోళనలు చేస్తున్నారు.ఒక వైపు ఢిల్లీ ప్రముఖులను కలవడంతో పాటు మరో వైపు తమ గోడును జాతీయ మీడియాలో వినిపించేందుకు సిద్దం అయ్యారు.

మొదటగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి అమరావతి రైతులు తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.వేల ఎకరాలు ఇచ్చిన మేము ఇప్పుడు ఏం చేయాలని, మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

అమరావతి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అంతా కూడా జగన్‌ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోతారంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు సహా సోనియా గాంధీ ఇంకా కేంద్ర నాయకులను కూడా అమరావతి రైతులు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube