రవితేజ, ఇలియానా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రంకు నెగటివ్ టాక్ వచ్చింది.
మరోసారి అదే మూస తరహా స్క్రీన్ప్లేతో దర్శకుడు శ్రీనువైట్ల బోర్ కొట్టించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇలియానా కూడా ఈ చిత్రంతో ఆకట్టుకోలేక పోయింది.
మరీ లావుగా, మునుపటి రూపం ఛాయలు ఏమాత్రం కనిపించకుండా ఆమె ఆకట్టుకోలేక పోయింది.మొత్తంగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది.
సినిమా ఫ్లాప్ అయినా కూడా మొదటి రోజు కలెక్షన్స్ ఒక మోస్తరుగా వచ్చాయి.పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు, సినిమాకు మొదటి నుండి కూడా అంచనాలు ఎక్కువగా ఉన్న కారణంగా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3.42 కోట్ల షేర్ను దక్కించుకుంది.రవితేజ మూవీ ఈ స్థాయిలో రాబట్టడం అంటే గొప్పే అని చెప్పుకోవాలి.
ఇక రెండవ రోజు కలెక్షన్స్ మరీ దారుణంగా పడిపోయాయి.ట్యాక్సీవాలా విడుదల అవ్వడంతో రెండవ రోజే ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
రెండవ రోజు కనీసం కోటి షేర్ కూడా దక్కలేదని తెలుస్తోంది.ఇక ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం దారుణమైన కలెక్షన్స్ను చవిచూస్తోంది.
ఏరియాల వారిగా మొదటి రోజు దక్కించుకున్న షేర్ :
నైజాం – 1.26 కోట్లు సీడెడ్ – 47 లక్షలు ఉత్తరాంధ్ర – 45 లక్షలు ఈస్ట్ – 29 లక్షలు వెస్ట్ – 21 లక్షలు కృష్ణ – 20 లక్షలు గుంటూరు – 41 లక్షలు నెల్లూరు – 13 లక్షలు
మొత్తం – 3.42 కోట్లు
.