వెబ్ సిరీస్ కు ఈ రోజుల్లో మంచి ఆదరణ ఉంటుంది.ప్రతి ఒక్కరూ కూడా సినిమాల్లో ఎలా నటించాలని ఆశక్తి వ్యక్తం చేస్తారో, అంతే ఆసక్తి తో వెబ్ సిరీస్ లో కూడా నటించాలని నటీనటులు ఆశ పడుతున్నారు.
ఎందుకంటే వాటి ఆదరణ ఆ రేంజ్ లో ఉంది.ఒక్క వెబ్ సిరీస్ లో క్లిక్ అయ్యామా ఇక వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేదు.
ఆ మధ్య వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ అన్న వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.హిందీ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో రీమేక్ చేయాలని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే కియారా అద్వానీ,రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు హిందీ లో మంచి ఆదరణ లభించింది.ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ రోల్ లో ఇటీవల ‘ఆమె’ చిత్రంలో బోల్డ్ గా నటించి తానేంటో నిరూపించుకున్న అమలాపాల్ ని తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
‘ఆమె’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసిన ముద్దుగుమ్మ అమలా పాల్.బాక్సాఫీస్ వద్ద కలక్షన్ ల వర్షం కురిపించకపోయినప్పటికీ సౌత్ సినీ ఇండస్ట్రీ నే కాకుండా.ప్రముఖ బాలీవుడ్ దర్శక , నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ పై ప్రశంశల వర్షం కురిపించారు.‘ఆమె’ సినిమాలో అమలా పాల్ బోల్డ్, బ్యూటిఫుల్గా ఉన్నారని ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా మెచ్చుకున్నవిషయం తెలిసిందే.అయితే ఈ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో కియారా పాత్ర లో అమలాపాల్ ని తీసుకోనున్నట్లు సమాచారం.అయితే ఈ వెబ్ సిరీస్ కు దర్శకులుగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో పాటు నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్లు పని చేయనున్నట్లు సమాచారం.
ఈ సిరీస్లోని మొత్తం నాలుగు కధలను ఆ నలుగురు డైరక్టర్స్ దర్సకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.మరో విశేషం ఏమిటంటే ఈ సిరీస్ లో జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు టాక్.మొత్తానికి ఇప్పటివరకు ఒక భాష కు సంబందించిన చిత్రాలను, వేరొక భాష లోకి రీమేక్ చేస్తున్నారు.అయితే ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా మొదలైనట్లు అర్ధం అవుతుంది.
ఒకవేళ తెలుగులో కూడా ఈ లస్ట్ స్టోరీస్ కు మంచి ఆదరణ లభిస్తే మాత్రం ఇక ఒకొక్కటిగా రీమేక్ చేస్తూనే ఉంటారేమో.