మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
దీనిని కంప్లీట్ చేసిన తర్వాత మూడు సినిమాలని లైన్ లో పెట్టారు.అయితే వీటిలో దేనిని ముందుగా స్టార్ట్ చేస్తారు అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.
కాని మూడు సినిమాలకి సంబందించిన దర్శకులు ఏ సమయంలో షూటింగ్ స్టార్ట్ చేసిన రెడీ అనే విధంగా ఉన్నారు.వీటిలో రెండు రీమేక్ మూవీలు కావడం విశేషం.
ఇదిలా ఉంటే బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాని ఖరారు చేసినట్లు టాక్ ఉంది.ఇప్పుడు లూసీఫర్ లో మెగాస్టార్ కాస్తా వయస్సు మళ్ళిన పొలిటికల్ కింగ్ మేకర్ గా కనిపిస్తాడు.
అయితే ఆ పాత్రకి హీరోయిన్ లేదు.
కాని ఇందులో మరో కీలక పాత్ర ఉంది.
హీరో చెల్లెలు పాత్ర సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్నది కావడం విశేషం.ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు.
అయితే ఎవరిని ఫైనల్ చేయలేదు.ఇప్పుడు ఈ పాత్రలో కనిపించే అవకాశం సీనియర్ నటి అమలకి వచ్చినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే అమల అప్పుడప్పుడు పాత్ర ప్రాధాన్యత బట్టి సినిమాలలో కనిపిస్తుంది.అయితే తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కనిపించలేదు.
అయితే ఈ సారి లూసీఫర్ మూవీ కోసం ఆమెని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.అమల కూడా ఇందులో నటించడానికి ఒకే చెప్పెసినట్లు బోగట్టా.
ఇదిలా ఉంటే చిరంజీవి, అమల గతంలో రాజా విక్రమార్క అనే సినిమాలో హీరో, హీరోయిన్స్ గా నటించారు.ఆ సినిమా మంచి హిట్ అయ్యింది.
ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ అన్నా చెల్లెలు పాత్రలలో లూసీఫర్ కోసం వీరిద్దరు జత కట్టబోతూ ఉండటం విశేషం అని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.