తమిళ బ్యూటీ అమలా పాల్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.గతంలో ఆమె తన భర్త ఏఎల్ విజయ్ నుండి విడాకులు తీసుకుని వార్తల్లోకి ఎక్కగా, అటుపై ఆమె చిత్రంలో పూర్తి నగ్నంగా నటించి కోలీవుడ్ వర్గాల చూపును తనవైపు తిప్పుకుంది.
ఇక ఇప్పుడు మరోసారి వివాదాస్పద వెబ్ సిరీస్లో నటించేందుకు రెడీ అయిన అమలా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
బాలీవుడ్ జనాలను ఉర్రూతలూగించిన లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే.
ఈ సిరీస్ను ప్రస్తుతం తెలుగులో తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు.ఇక ఆ వెబ్ సిరీస్లో కియారా అద్వానీ చేసిన పాత్ర ఎలాంటి రెస్పాన్స్ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఆ పాత్రను తెలుగులో అమలాపాల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వెబ్ సిరీస్లో అమలా పాల్ ప్రముఖ నటుడు జగపతి బాబుతో బోల్డ్ రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది.
ఈ జంట వెబ్సిరీస్లో ఎలా రెచ్చిపోతారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.ఇక ఈ వెబ్ సిరీస్ను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేయనుంది.