తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు అభిమానులను సంపాదించుకున్నారు అమలా పాల్.రామ్ చరణ్ తో నటించిన నాయక్, అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలు అమలా పాల్ కు నటిగా మంచిపేరు తెచ్చిపెట్టాయి.
గత కొన్నేళ్లుగా తెలుగులో పెద్దగా అవకాశాలు లేని అమలా పాల్ కు ఇతర భాషల్లో మాత్రం బాగానే ఆఫర్లు వస్తున్నాయి.
అయితే రెండు విషయాలు మాత్రం అమలాపాల్ తనకు అస్సలు నచ్చవని చెబుతోంది.ఎవరైనా తన గతం గురించి కానీ, సెకండ్ మ్యారేజ్ గురించి కానీ మాట్లాడితే ఎక్కడ లేని కోపం వస్తుందని ఆమె చెబుతోంది.2014 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ను అమలాపాల్ వివాహం చేసుకున్నారు.అయితే పెళ్లి తరువాత వాళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.అప్పటినుంచి అమలాపాల్ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు.
మొదటి భర్తతో విడిపోయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంతో అమలాపాల్ కు సైతం బంధువులు, సన్నిహితుల నుంచి ఇదే తరహా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.అయితే అమలాపాల్ మాత్రం పట్టించుకోకుండా యోగా, ధ్యానంతో పాటు అధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టారని సమాచారం.
మరోవైపు సినిమా, వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నా అమలాపాల్ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తీరిక వేళల్లో పుస్తకాలు చదవటానికి అమలా పాల్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే అమలా పాల్ తన స్నేహితులతో పాటు మంచిని కోరే వారికి రెండో పెళ్లి గురించి తన దగ్గర ప్రస్తావించవద్దని సూచనలు చేసినట్టు తెలుస్తోంది.హీరోయిన్ అమలా పాల్ కు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏ మాత్రం లేదని ఆమె వైఖరి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది.