తమిళంలో అందాల భామ అమలా పాల్ నటించే చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది.ఆమె చేసే పాత్రలకు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేయడమే కాకుండా సినిమాకు బాగా హెల్ప్ అవుతుండటమే దీనికి కారణం.
ఇక ‘ఆమె’ చిత్రంతో అమలా పాల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా పలు వివాదాలకు దారితీసినా, అమలా నటనకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
కాగా ఇప్పుడు ఆమె తమిళ స్టార్ హీరో రజినీకాంత్ బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తోంది.
తలైవా రజినీకాంత్ తరుచూ హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానం చేస్తుంటాడు.
తన బిజీ లైఫ్లో ఎప్పుడు ఖాళీ దొరికినా హిమాలయాలకు వెళ్తుంటాడు రజినీకాంత్.అయితే ఇప్పుడు ఆయన బాటలో నటి అమలా పాల్ కూడా వెళ్తోంది.
ఇటీవల ఆమె ఉత్తరాఖండ్లోని రిషికేష్కు వెళ్లి అక్కడి గుహల్లో ధ్యానం చేసింది.దీనికి సంబంధించిన ఫోటోలను అమ్మడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి.
తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా బాగా ఒత్తిడికి గురయ్యానని, ఇలా ధ్యానం చేయడంతో తనకు మానసిక ఒత్తడికి దూరం అయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను గతంలో పెళ్లాడిన అమలా పాల్, మనస్పర్థ కారణాలతో అతడితో విడిపోయింది.
ఈ డిప్రెషన్ నుండి బయటపడేందుకు తనకు చాలా సమయం పట్టిందని అమలా గతంలోనే చెప్పుకొచ్చింది.ఏదేమైనా ఇలా రజినీకాంత్ బాటలో అమలాపాల్ ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుక్కోవడం ఆమెకు మంచి జరిగేలా చేస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు.
ఇక తమిళంలో ప్రస్తుతం పలు సినిమాల్లో ఆమె బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అంతేగాక పలు వెబ్ సిరీస్లలో కూడా అమలా పాల్ నటిస్తోంది.