తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.నిజామాబాద్ లో ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అర్ధవంతమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.
అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.నిజామాబాద్ నుంచి తిరుగులేని సమాధానం ఇవ్వాలని తెలిపారు.
నిజామాబాద్ కు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు.కేంద్రం తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలపై కక్ష గట్టడంతో పాటు కేసీఆర్ చేస్తున్న మంచిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుందని ఆరోపించారు.