ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా అసహజ ప్రేమలు, సంబంధాలు ఎక్కువ అయిపోయాయి.సుప్రీం కోర్ట్ తీర్పు తర్వాత చాలా మంది తమ అసహజ వాంచలని, బంధాలని బయట పెడుతున్నారు.
కొంత మంది మరో అడుగు ముందుకి వేసి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు.అయితే కొంత మంది పెళ్లి తర్వాత భర్త లేదా భార్యని వదిలేసి ఇలాంటి హోమో సెక్సువల్ రిలేషన్ కోరుకుంటున్నారు.
తమ అసహజ భాగస్వామితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
తాజాగా రాజస్థాన్ లో అల్వారాలో జరిగిన ఘటన ఇప్పుడు ఇలాంటి భాగోతాన్ని మరోసారి పరిచయం చేసింది.
సరిగ్గా 23 రోజుల క్రితం కొత్తగా పెళ్లైన యువతి ఇంటి నుంచి పారిపోయింది.ఎటు వెళ్లిందో తెలీక వెతికించిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం గాలించగా వేరే రాష్ట్రంలో ఓ మహిళతో కనిపించింది.ఆమె గురించి పూర్తిగా ఆరాతీయగా తాను లెస్బియన్ అని, భర్తతో కాపురం చేయలేనని చెప్పేసింది.
ఈ ఘటన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది.భర్త ఫిర్యాదుతో ఆమెను వెతికి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
అక్కడ ఆమె సంచలన నిజాలు చెప్పింది.తాను మరో మహిళని ప్రేమించానని, ఆమెతో సహజీవనం చేస్తున్నాను అని తేల్చేసింది.
ఇక తనకి భర్త కంటే ఆమె ఎక్కువ ఇష్టమని చెప్పి ఇంకా ఏమి మాట్లాడాలో అర్ధం కాక ఆమె ఇష్టప్రకారం వదిలేసారు.