జనసేనకు మరో ఎదురు దెబ్బ

మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత జనసేనను సంస్థాగతంగా నిర్మించేందుకు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.మొన్నటి ఎన్నికల్లో కనీసం డజను సీట్లు గెలిచినా కూడా చాలా క్రియాశీలకంగా పవన్‌ వ్యవహరించే వాడు.

 Alluri Krishnam Raju Good Bye To Janasena-TeluguStop.com

కాని ఆయన పోటీ చేసిన సీట్లనే గెలవలేక పోయాడు.దాంతో కేసీఆర్‌పై నమ్మకం సన్నగిల్లిన జనసైనికులు మెల్లగా తమ దారి తాము చూసుకుంటున్నారు.

ఒక వైపు పార్టీ నిర్మాణం కోసం పవన్‌ కళ్యాణ్‌ కృషి చేస్తుంటే మరో వైపు ముఖ్య నాయకులు అంతా జారుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు జనసేన నాయకులు పార్టీ మారగా నేడు మాజీ ఎమ్మెల్యే, జనసేన ముఖ్య నాయకుడు అల్లూరి కృష్ణంరాజు కూడా పార్టీకి గుడ్‌ బై చెప్పాడు.

ఇప్పటి వరకు పలువురు నాయకులు పార్టీని వదిలి మరే పార్టీలో జాయిన్‌ కాకుండా అలా ఉన్నారు.కాని అల్లూరి కృష్ణంరాజు మాత్రం పార్టీ మారిన వెంటనే వైకాపాలో జాయిన్‌ అయ్యాడు.

జగన్‌ కండువ కప్పి మరీ ఆయన తన పార్టీలోకి కృష్ణం రాజును ఆహ్వానించాడు.జనసేన పార్టీకి కృష్ణంరాజు ఎగ్జిట్‌తో పెద్ద నష్టం అంటూ ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube