బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అల్లుడు అదుర్స్.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంను పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నాడు.షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.
ఈ సమ్మర్లో సినిమాను విడుదల చేయాల్సి ఉంది.కరోనా కారణంగా సినిమా బ్యాలన్స్ షూట్ను పూర్తి చేయలేక పోయారు.
సినిమాను విడుదల చేసేందుకు ఇంకా చాలా సమయం ఉంది.కనుక ఈ సమయంలో సినిమాకు సంబంధించిన కమర్షియల్ ఎలిమెంట్స్ను మరింతగా పెంచేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ను జత చేయాలని భావించాడట.అందుకోసం దేవిశ్రీ ప్రసాద్తో ఒక ట్యూన్ను కూడా రెడీ చేయించినట్లుగా తెలుస్తోంది.
ఐటెం సాంగ్ను స్టార్ హీరోయిన్ తమన్నాతో చేయించాలనే నిర్ణయానికి వచ్చారట.ఈ చిత్రంలో ఇప్పటికే అను ఎమాన్యూల్ మరియు నభా నటేష్లు నటిస్తున్నారు.వీరిద్దరితో పాటు తమన్నా కూడా ఈ చిత్రంలో ఉంటే నిజంగానే ప్రేక్షకులు అదుర్స్ అనడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్ తప్పనిసరి.
అందుకే తమన్నా ఐటెం సాంగ్ను ప్రత్యేకంగా భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తమన్నా పారితోషికంతో కలిపి మొత్తంగా రెండున్న కోట్లను కేవలం ఈ ఐటెం సాంగ్ కోసం ఖర్చు చేస్తున్నారట.
మరి ఇంత భారీగా చేస్తున్న ఆ ఐటెం సాంగ్ సినిమాకు సక్సెస్ తెచ్చేనా చూడాలి.