అల్లు రామలింగయ్య 99 వ జయంతి సందర్భంగా అల్లు వారి ఫ్యామిలీ అల్లు స్టూడియోస్ నిర్మించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు.
ప్రకటించి ఇంకా వారం రోజులు కూడా గడవకుండానే అల్లు స్టూడియోస్ కు సంబంధించిన భూమిపూజ ను నిర్వహించారు.ఈ భూమి పూజ కార్యక్రమంలో అల్లు వారి ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు.
కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ ఈ భూమి పూజ నిర్వహించారు.రెండు రోజులుగా ఈ స్టూడియో హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
కానీ అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ని బట్టి చూస్తుంటే ఈ స్టూడియో హైదరాబాదులోని శివారు ప్రాంతంలో కాకుండా నగరం మధ్యలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
స్టూడియో భూమి పూజ వీడియోలో స్టూడియో చుట్టూ పెద్ద పెద్ద భవనాలు మరియు కంపెనీలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.
అంటే సిటీలోనే అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ స్టూడియో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఈ స్టూడియో కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇండోర్ మరియు అవుట్ డోర్ షూటింగ్ లకు సంబంధించి ఈ స్టూడియో అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటుందని అల్లు వారి ఫ్యామిలీ చెబుతోంది.హాలీవుడ్ హంగులతో ఈ స్టూడియోను నిర్మించి టాలీవుడ్ కు బహుమానంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న స్టూడియోలకు పది రెట్లు అడ్వాన్స్ టెక్నాలజీని ఈ స్టూడియో నిర్మాణం కు ఉపయోగిస్తున్నట్లు గా అల్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వచ్చే ఏడాది అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా ఈ స్టూడియో టాలీవుడ్ కి అందించబోతున్నారట.
ఈ స్టూడియో ఏర్పాటును అల్లు బ్రదర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.