ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో ఎంత సరదాగా గడుపుతాడో అందరికి తెలిసిన విషయమే.ఎందుకంటే ఎప్పుడు ఆయన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాడు.
సినిమా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినా కుటుంబంతో గడపడానికే అల్లు అర్జున్ ఇష్ట పడుతుంటాడు.ఫ్యామిలీతో అప్పుడప్పుడు విహారయాత్రలకు కూడా వెళ్తుంటాడు.
ఇక ఇప్పుడు కూడా అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి తో కలిసి హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.
ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువుగానే ఉంటారు.తమ లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ ను స్నేహ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్లతో పంచుకుంటుంది.
ఇక తాజాగా బన్నీతో కలిసి ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అల్లు అర్జున్, స్నేహ దంపతులు ప్రెసెంట్ మాల్దీవులు ట్రిప్ ను ఎంజాయ్ చేస్తునాన్రు.మాల్దీవుల్లో సముద్రంలో బోటు షికారుకు వెళ్లిన వీడియోను స్నేహ షేర్ చేసారు.ఈ వీడియో అల్లు అర్జున్ పిల్లలు కనిపించలేదు.
కేవలం స్నేహ బన్నీ దంపతులు మాత్రమే షికారుకు వెళ్లినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.బన్నీ అభిమానులు ఈ వీడియో చూసి బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తుంటే.రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.ఇక ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.