అల్లు ఫ్యామిలీ
నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన
అల్లు శిరీష్
గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక అల్లాడుతున్నాడు.శిరీష్ చేసిన లాస్ట్ మూవీ ఏబీసీడీ యావరేజ్ హిట్గా నిలవగా ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.
దీంతో అల్లు శిరీష్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా అనే సందేహం ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.
అయితే తాజాగా
సోషల్ మీడియా
లో ఇదే విషయంపై ఓ అభిమాని శిరీష్ను తన నెక్ట్స్ మూవీ గురించి అడిగాడు.
ఈ క్రమంలో తన నెక్ట్స్ మూవీ గురించి శిరీష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.తన నెక్ట్స్ మూవీ పూర్తి ఎంటర్టైనర్గా రానుందని, త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని
అల్లు హీరో
తెలిపాడు.
కాగా
మెగాస్టార్ చిరంజీవి
కళ్యాణ్ దేవ్
నటించిన విజేత చిత్రాన్ని రూపొందించిన
రాకేష్ శశి
డైరెక్షన్లో తెరకెక్కించనున్నట్లు, ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టాలనుకున్న సమయంలో
కరోనా వైరస్
కారణంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిందని శిరీష్ తెలిపాడు.