అల్లు శిరీష్ నటించిన ”శ్రీరస్తు శుభమస్తు’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అల్లు శిరీష్ కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసాడు.ఆ వ్యాఖ్యలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద చేసాడు.
వారిలాగా నేను మాస్ జోలికి పోనని, క్లాసు టచ్ తో ఉండే రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ మీద మాత్రమే దృష్టి పెడతానని అన్నాడు.పవన్ ‘గబ్బర్ సింగ్’ అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాలు కేవలం మాస్ ని మాత్రమే ఎలివేట్ చేశాయని అన్నాడు.
అక్కడితో ఆగకుండా ఈ రోజుల్లో ఏ అగ్ర దర్శకుడు కూడా కథ మీద దృష్టి పెట్టటం లేదని కామెంట్ చేసాడు.శిరీష్ చేసిన ఈ కామెంట్స్ అందరిని ఆశ్చర్యంలోకి నెట్టాయి.
అంతేకాక ”శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో కూడా కథ లేదని కధనం మీదే నడుస్తుందని చెప్పాడు.ఈ సినిమా హిట్ అల్లు శిరీష్, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన పరుశురాం కి కూడా అవసరం.
ఇలాంటి పరిస్థితిలో అల్లు శిరీష్ పవర్ స్టార్,స్టైలిష్ స్టార్ మీద కామెంట్స్ చేసి మెగా అభిమానులకు షాక్ ఇచ్చాడు.ఏది ఏమైనా ఇంకా వ్యూహాత్మకంగా మాట్లాడటం అల్లు శిరీష్ కి రాలేదని చెప్పాలి.