టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబం గురించి అందరికీ తెలిసిందే.ఈ కుటుంబం కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉంది.
ఈ కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు పరిచయమయ్యారు.అందులో అల్లు అర్జున్ స్టార్ హీరో గా నిలిచాడు.
అల్లు శిరీష్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యాడు.కానీ స్టార్ హోదా ను మాత్రం ఇప్పటికి సొంతం చేసుకోలేకపోయాడు.
ఇక అల్లు శిరీష్ సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా బాల నటుడుగా అడుగు పెట్టాడు.అలా పలు సినిమాలలో నటించగా 2013లో గౌరవం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
ఇక ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు వంటి పలు సినిమాలలో నటించాడు.
కానీ అంత సక్సెస్ కాలేకపోయాడు.పైగా అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోతున్నాడు.
దీంతో ప్రస్తుతం అవకాశాల కోసం వెయిటింగ్ లో ఉన్నాడు.ఇక అల్లు శిరీష్ నటుడుగానే కాకుండా పత్రిక ఎడిటర్ గా కూడా పని చేశాడు.అది ఏదో కాదు.సౌత్ స్కోప్ మాసపత్రికలోనే ఎడిటర్ గా చేశాడు.
అంతేకాకుండా గీతా ఆర్ట్స్ సంస్థ కో ప్రొడ్యూసర్ గా కూడా చేశాడు.అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ కూడా నిర్మాత, సినీ నటుడన్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ తన తండ్రి, తన అల్లు అర్జున్ లా మాత్రం ఎదగలేకపోతున్నాడు.కానీ శిరీష్ కొన్ని కొన్ని ఫిలిం ఈవెంట్లలో వ్యాఖ్యాతగా కూడా చేశాడు.ఇక ఈయన కెరీర్ మొదట్లోనే ఒక టీవీ ఛానెల్ కూడా పెట్టాలనుకున్నాడు.కానీ అది కూడా మొదటికే ముగిసింది.ఇక ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజుల నుండి అల్లు శిరీష్ ను అల్లు ఫ్యామిలీ పూర్తిగా దూరం పెట్టింది అని.
కనీసం ఏ విషయంలో కూడా పట్టించుకోవడం లేదు అని దాంతో అల్లు శిరీష్ బయట బయటనే ఉంటున్నాడు అని వార్తలు వినిపించాయి.అంతే కాకుండా అల్లు అర్జున్, స్నేహలతో అల్లు శిరీష్ కి గొడవ జరిగింది అని తెగ వార్తలు హల్ చల్ చేశాయి.అంతేకాకుండా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య లో లోపల వార్ నడిచిందని అందుకే ఆ రెండు ఫ్యామిలీలు ఎక్కడ కలవడం లేదు అని తెగ పుకార్లు వచ్చాయి.
ఇవన్నీ కేవలం దుష్ప్రచారం అని తాజాగా క్లియర్ అయింది.ఇంతకూ అసలు విషయం ఏంటంటే.తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.ఇక ఈ వేడుకలో అల్లు ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ కూడా కనిపించారు.
అల్లు అర్జున్, చిరంజీవి పక్క పక్కనే కూర్చోవడం కాకుండా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నట్లు కూడా కనిపించారు.
ఇక శిరీష్ కూడా అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలతో సరదాగా కనిపించాడు.
దీంతో ఇవన్నీ చూస్తే ఈ కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు లేవు అని.ఎవరో కావాలని ఈ కుటుంబం పై దుష్ప్రచారం చేశారు అని తెలుస్తుంది.ప్రస్తుతం.ఈ కుటుంబం పై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది అని టాలీవుడ్ ఇండస్ట్రీ బాగా చర్చలు కూడా మొదలు పెట్టింది.ఇక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న శిరీష్ కు ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాలో అవకాశం వచ్చిందని తెలుస్తుంది.