అల్లు శిరీష్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.కథలు వింటున్న ఆయన సినిమాకు మాత్రం ఓకే చెప్పడం లేదు.
ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమా కథలు విన్న ఆయన సినిమాను మొదలు పెట్టలేదు.ఎట్టకేలకు ఒక తమిళ సినిమాను చేసేందుకు కమిట్ అయినట్లుగా సమాచారం అందుతోంది.
ఒకేసారి మూడు సినిమాలు చేయబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.మూడు సినిమాల్లో ఒక సినిమాను రాకేశ్ శశి దర్శకత్వంలో చేయబోతున్నాడట.
మెగా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే.ఆ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు.ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.అంతకు ముందు నీ జతగా చిత్రంను కూడా చేసిన రాకేశ్ శశి ఆకట్టుకోలేక పోయాడు.రెండు ఫ్లాప్లు ఇచ్చినా కూడా రాకేశ్ శశికి మళ్లీ అల్లు శిరీష్ ఛాన్స్ ఇవ్వడంతో అంతా కూడా ఇప్పుడు శిరీష్కు ఏమైనా మైండ్ దొబ్బిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెగా హీరోలకు రాకేశ్ శశి సన్నిహితుడు మరియు స్నేహితుడు.
ఆ కారణంగానే మరో ఛాన్స్ను ఆయనకు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.రాకేశ్ శశితో సినిమా అంటే చాలా పెద్ద సాహసమే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.
కాని శిరీష్ మాత్రం రీమేక్ కనుక పెద్దగా సమస్య ఉండక పోవచ్చు అనే నమ్మకంతో ఉన్నాడు.మొత్తానికి శిరీష్ నిర్ణయాన్ని మెగా ఫ్యాన్స్ కూడా సమర్ధించడం లేదు.