టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాని స్టార్ హీరోగా నిలవలేకపోయాడు.బాల నటుడిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ 2013లో గౌరవం సినిమాలో తొలిసారిగా హీరోగా నటించాడు.
ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటించి తన నటనకు మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయన తాజాగా లవ్ లో ఫెయిల్ అయిన ఓ అభిమానిని ఓదార్చాడు.
సోషల్ మీడియాలో కూడా బాగా ఎనర్జీ గా కనిపిస్తాడు.తన సంబంధించిన ఫోటోలను, సినిమా విషయాలను బాగా పంచుకుంటాడు.
అంతే కాకుండా తన కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగినా ఆ ఫోటోలను వెంటనే పంచుకుంటాడు అల్లు శిరీష్.ఇక తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంటాడు.
ఇదిలా ఉంటే శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో.
శిరీష్ ప్రేమలో ఓడిపోయిన వారిని ఉద్దేశిస్తూ ఓ డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే.లైఫ్ లో ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు.ఏదో తెలియకుండానే బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్.మన క్యారెక్టర్ ని మనమే తెలియకుండా చంపేసుకుంటున్నాం అంటూ ఓ డైలాగ్ చెప్పగా.ఇక ఆ డైలాగ్ నే తాజాగా ఓ అభిమాని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
సేమ్ ఫీలింగ్ అంటూ అల్లు శిరీష్ ను ట్యాగ్ చేశాడు.వెంటనే అల్లు శిరీష్ ఈ మాటకు స్పందించి.అయ్యో ఏమి జరిగింది బ్రో అంటూ.
అది కేవలం సినిమాలో డైలాగ్ మాత్రమే.అంతే కానీ నీ ప్రేమని వదులుకోకు.
కచ్చితంగా సరైనది నీ దగ్గరికి వస్తుంది అని స్పందించాడు.దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ఆయన ప్రస్తుతం ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.