మెగాఫ్యామిలికి, అల్లు ఫ్యామిలికి మధ్య గత కొంత కాలంగా సరైన సంబంధాలు, ముఖ్యంగా అల్లు ఫ్యామిలి, పవన్ కళ్యాణ్ కి మధ్య సరైన సంబంధాలు లేవని ఇండస్ట్రీలో బలమైన టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ వాదనకి బలాన్ని చేకూర్చేలా ఓ చేదు నిజం బయటపడింది.
హీరోలకి పీఆర్ టీమ్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే.ఈ పీఆర్ టీమ్ లో పనిచేసేవారు సొంత మనుషులు కావడంతో, అలాగే తమ ఆజ్ఞానుసారం అణిగిమణిగి ఉండే వారు కావడంతో, వీరితో బిందాస్ గా తమ భావాల్ని, కోపాన్ని .అన్నీటిని బయటకి చూపిస్తారన్నమాట.
అల్లు శిరీష్ ని కించపరుస్తూ ఏదో ఫేస్ బుక్ పేజి క్రియేట్ చేసారు ఎవరో అజ్ఞాత వ్యక్తి/వ్యక్తులు.
ఈ పేజి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా అల్లు శిరీష్ టీమ్, శిరీష్ కి మెసెజ్ పెడితే, దానికి శిరీష్ బదులిస్తూ “లైట్ తీస్కో, పట్టించుకోకు, వీపి కళ్యాణ్ గాడి ఫ్యాన్స్ లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయుండాలి.మనం ఈ విషయంలో పెద్దగా ఏం చేయలేం.
నేను రిపోర్టు చేసాను (ఆ పేజ్ గురించి), కాని ఫేస్ బుక్ ఇలాంటి విషయాల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు” అంటూ పవన్ మీద ఓ పెద్ధ బూతు వాడేసాడు.(వీపి – ఈ బూతు అర్థం మీకు తెలిసే ఉంటుంది).
ఇప్పుడు ఈ మెసెజ్లు ఎలా బయటపడ్డాయి అనే కదా మీ డౌటు.ఏముంది .అల్లు శిరీష్ టీమ్ మెంబర్ శిరీష్ కి ఎదురుతిరిగి ఈ మెసెజ్లని సోషల్ మీడియాలో బయటపెట్టేసాడు.