మొన్న ప్రేమికుల రోజు సందర్భంగా హిందీ ప్రేక్షకుల ముందుకు గల్లీ బాయ్ వచ్చింది.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
కేవలం ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా హాలీవుడ్ స్టార్స్ మరియు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.ఉత్తరాదిన సంచలన కలెక్షన్స్ రాబడుతున్న గల్లీ బాయ్ మూవీని సౌత్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాను మెగా హీరోతో చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రీమేక్ రైట్స్ కు భారీగా డిమాండ్ చేస్తున్నారు.అయినా కూడా మెగా నిర్మాత తీవ్రంగా ప్రయత్నాలు చేసి రైట్స్ ను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ మూవీని సాయి ధరమ్ తేజ్ లేదా వరుణ్ తేజ్ తో చేయాలనేది అల్లు అరవింద్ ప్రయత్నంగా తెలుస్తోంది.ప్రస్తుతం సినిమా ప్రమోషన్ తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు రీమేక్ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఈ రీమేక్ లో చరణ్, బన్నీల్లో ఎవరు నటించినా కూడా సూపర్ అంటూ ప్రచారం జరుగుతోంది.
మరి అల్లు అరవింద్ ఎవరితో ఈ రీమేక్ చేస్తాడో చూడాలి.