మెగా స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.అల్లు అరవింద్ వీరి కాంబినేషన్లో సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.
అయితే దాదాపు మూడు నెలుగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది లేదు.ఇన్నాళ్లకు ఆ సినిమాపై ఉన్న సందేహాలకు సమాధానాలు లభించాయి.
వచ్చే నెల రెండవ వారంలో ఈ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా స్వయంగా అల్లు అరవింద్ ప్రకటించాడు.
నేడు దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టిన రోజు సందర్బంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆఫీస్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్బంగా బోయపాటితో అల్లు అర్జున్, అల్లు అరవింద్లు కేక్ కట్ చేయించారు.ఈ సందర్బంగానే వచ్చే నెలలో ఈ సినిమాను ప్రారంభించనున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ తెలియజేశాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నటినటుల ఎంపిక జరుగుతున్నట్లుగా దర్శకుడు బోయపాటి చెప్పుకొచ్చాడు.తాజాగా బన్నీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో సక్సెస్ కొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
బోయపాటి ‘లెజెండ్’ సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే అనే విషయం తెల్సిందే.