సౌత్ సినిమా హీరోల్లో.ముఖ్యంగా మన టాలీవుడ్ లో సొంత పీ.
ఆర్ టీం తో సోషల్ మీడియాలో సూపర్ హంగామా చేస్తుంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఈ ఇద్దరికి సెపరేట్ పీ.ఆర్ టీం ఉండటం వల్ల వారి ఈవెంట్స్, అకేషన్స్, ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.వారు ఎప్పుడు ఏం చేసినా సరే నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతాయి.
అయితే నేషనల్ మీడియా అక్కడ హీరోలు ఈ విషయంపై దృష్టి పెట్టడంతో కొన్నాళ్లుగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉన్నారు.
సడెన్ గా వాళ్లెందుకు సైలెంట్ అయ్యారో తెలియదు కానీ వీరి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
వీరి పీ.ఆర్ టీం కూడా ఇప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గడం పట్ల అందరు షాక్ అవుతున్నారు.అల్లు అర్జున్ పుష్ప 2 కోసం సిద్ధం అవుతుండగా లైగర్ షూటింగ్ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ త్వరలోనే జన గణ మన సినిమాకి రెడీ అవుతున్నాడు.ఈ ఇద్దరు ప్రభాస్ కి ఈక్వల్ గా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు.