“యే జవాని హై దివానీ” , రణబీర్ కపూర్ కేరీర్లో అతిపెద్ద హిట్.సినిమా విడుదలైన సమయంలో ఖాన్ల రికార్డులు కొన్ని కొట్టేసింది కూడా ఈ సినిమా.
అందుకు కారణం ఆ సినిమా కథే.ఎక్కడా అతిగా అనిపించదు, అలాగని ఏమిలేనట్టుగా అనిపించదు.యువతరం మెచ్చే కథతో యువతరం గుండెల్లో చోటు సంపాదించాడు రణబీర్.
అందుకే ఈ సినిమాపై అక్కినేని నాగార్జున కన్నువేశారు.అఖిల్ కి సరిగ్గా సరిపోయే సినిమా అని, వంశీ పైడిపల్లితో రీమేక్ చేయిద్దామనుకున్నారు.కాని అఖిల్ రీమేక్ పై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.
కొత్త కథతోనే చేద్దామంటున్నాడు.
అఖిల్ వదిలేసుకున్నాడు కాని, ఆ సినిమా మీద వంశీ పైడిపల్లి ప్రేమ ఇంకా తగ్గలేదు.
బ్లాక్బస్టర్ కథని వదిలేసుకోవాలని ఏ డైరెక్టర్ కి మాత్రం ఉంటుంది.అందుకే ఈ సినిమా రీమేక్ చెద్దామని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళినట్లు సమాచారం.
అయితే అల్లు అర్జున్ నుంచి ఇంకా ఏలాంటి సమాధనం రాలేదట.తనకున్న బిజీ షెడ్యూలులో వంశీకి అల్లు అర్జున్ డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి.