‘అరవింద సమేత’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్తో చేయాలనుకున్నాడు.ఆ సినిమా విడుదలై ఆరు నెలలు అయ్యింది.
కాని ఇప్పటి వరకు సినిమా మొదలు పెట్టలేదు.గత ఏడాది డిసెంబర్లోనే వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కాల్సి ఉంది.
కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.అది ఏ కారణాలు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దర్శకుడు త్రివిక్రమ్ చెబుతున్న కథ అల్లు అండ్ కో కు ఎంతకు నచ్చడం లేదట.దాంతో సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.
ఇటీవలే వీరిద్దరి కాంబో మూవీని ఈనెలలోనే పట్టాలు ఎక్కించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కథ పూర్తి కాలేదని, కథలో ఇంకాస్త డెప్త్గా వెళ్లి డెవలప్ చేస్తున్నారని, ఏప్రిల్లో సినిమా ప్రారంభం అవుతుందని మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.అయితే త్రివిక్రమ్ మూవీని మరీ ఇంతగా నాన్చడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
బన్నీ గత సంవత్సరం నా పేరు సూర్య అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాడు.ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బన్నీ తదుపరి చిత్రం విషయంలో చాలా అంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.త్రివిక్రమ్తో ఇప్పటికే రెండు సినిమాలు చేసి సక్సెస్ అయ్యాను కనుక మరో విజయం ఖాయం అని ఆయనతో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు.కాని ఇప్పుడు కథ విషయంలో పేచీలు పెడుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.