స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్నాయి.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే బన్నీ తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించాడు.ఆర్య, ఆర్య 2 వంటి బ్లాక్బస్టర్లు అందించిన సుకుమార్ డైరెక్షన్లో బన్నీ తన నెక్ట్స్ మూవీని చేస్తున్నాడు.
ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు చిత్ర యూనిట్.ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడుతాడట.దీని కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకోనున్నాడట.
అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ పనులు ముగించుకోగానే బన్నీ ఈ ట్రైనింగ్ తీసుకోనున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తు్న్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.అల్లు అర్జున్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి కథనంతో వస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.