స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సుకుమార్ తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు.ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ క్రమంలో బన్నీ తన నెక్ట్స్ చిత్రం కోసం పలువురు డైరెక్టర్ల నుండి కథలను వింటున్నాడట.కాగా యాత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన దర్వకుడు మహి వి రాఘవ బన్నీ కోసం ఓ కథను రాస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్టోరీలైన్ను బన్నీకి వినిపించగా, ఆయన ఈ సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడట.దీంతో ఈ సినిమా కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో పడ్డాడు ఈ డైరెక్టర్.
కాగా ఈ సినిమాను కూడా పూర్తి పొలిటికల్ ఎంటర్టైనర్గా మహి వి రాఘవ రాస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో బన్నీ సీఎం పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఒక నాయకుడు రాజకీయాల్లో తనకెదురైన సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు, వాటిని అతడు అధిగమించి సీఎంగా ఎలా ఎన్నికయ్యాడనేది చిత్ర కథగా మహి వి రాఘవ రాస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో బన్నీ సీఎం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట.
కాగా ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.